తను తిరుపతి వెళ్లి మొక్కు తీర్చుకుని వస్తాననీ, అప్పటి వరకూ తన ప్రియమైన కుక్క టైగర్ ని జాగ్రత్తగా చూసుకోమనీ, తన స్నేహితుడు దీక్షితులుని బతిమాలాడు సింగారం. అందుకు ప్రతిఫలంగా, దీక్షితులుకి తనకి ఎంతో ఇష్టమైన చేతి గడియారం ఇచ్చాడు. తను లేని రెండు రోజులూ, పాడి అనుభవించమని తన ఆవూ, దూడని కూడా తోలి పెట్టాడు. మొండి ఘటం,అల్లరి పెంకి టైగర్, దీక్షితులు మాట వినకుండా, ఊరూ వాడా ఏకం చేసి, అందరినీ కొరికి, నానా రచ్చా చేసింది. చివరికి ఊరివాళ్ళ కోపానికి, దెబ్బలు తిని ప్రాణం విడిచింది. చివరికి దీక్షితులుకి మిగిలింది- సింగారం చేత “కృతఘ్నుడు” అనే అసహ్యమైన బిరుదు మాత్రమే.
By: Mullapudi Venkataramana
44 min
2023-06-25
Fiction
Give as a gift